విశాఖలోని కైలాసపురం 46వ వార్డులో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ ప్రసాద్ అధ్వర్యంలో జరుగుతున్న శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి 16వ వార్షికోత్సవంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అమ్మవారిని దర్శించుకున్నారు. బుధవారం ఆయన ఆలయంలో ప్రత్యే పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు జీవీఎల్కు ఘనంగా స్వాగతం పలికారు.