గణపర్తి గ్రామంలో కేంద్ర పోలీసులు కవాతు

581చూసినవారు
త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్భయంగా స్వేచ్ఛగా ఎటువంటి భయాందోళనలు లేకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. మునగపాక మండలంలో గణపర్తి గ్రామంలో శుక్రవారం స్థానిక పోలీస్ అధికారుల నేతృత్వంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు అధికారులు మాట్లాడుతూ ఓటర్ల ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్