ఏపీలోని ఈ జిల్లాలకు హెచ్చరిక

177133చూసినవారు
ఏపీలోని ఈ జిల్లాలకు హెచ్చరిక
ఈ నెల నుంచి రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత పెరుగుతాయని పేర్కొంది. ఏపీలోని కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప, కోనసీమ, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సమాచారం కోసం 112, 1070 హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేయాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్