అదుపుతప్పి లోయలో పడిన కారు.. ఇద్దరు మృతి

58చూసినవారు
అదుపుతప్పి లోయలో పడిన కారు.. ఇద్దరు మృతి
ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ గర్హాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 12 మందితో వెళ్తున్న కారు అదపుతప్పి రోడ్డు పక్కనున్న భారీ లోయలోకి దూసుకెళ్లింది. ఫల్టీలు కొట్టి కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దువా కోటి సమీపంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను గాజా ఆస్పత్రికి, నరేంద్రనగర్‌ ఆస్పత్రికి తరలించినట్లు జిల్లా విపత్తు నిర్వహణాధికారి బ్రిజేష్‌ భట్‌ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్