కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొస్తాం: మంత్రి లోకేష్

83చూసినవారు
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొస్తాం: మంత్రి లోకేష్
కేదార్‌నాథ్‌లో 18 మంది తెలుగు యాత్రికులు చిక్కుకున్న ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా స్పందించారు. శుక్రవారం మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దీని కోసం ప్రత్యేకంగా టీమ్‌లను ఏర్పాటు చేశాం. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. ఈలోగా వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారాన్ని కోరాం.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్