తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీసీఐ కార్యదర్శి జై షా

85చూసినవారు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీసీఐ కార్యదర్శి జై షా
తిరుమల శ్రీవారిని బీసీసీఐ కార్యదర్శి జై షా దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం స్వామివారి సేవలో జైషా పాల్గొన్నారు. ఆయనకు తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తితిదే అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్