AP: రాష్ట్రంలో సహకార వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వ అవినీతి లెక్కలు తేల్చి తిన్నదంతా వసూలు చేస్తామని స్పష్టం చేశారు. సహకార సంఘాలు, డీసీసీబీల్లో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కొత్త సంస్కరణలు తెచ్చి సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామని వివరించారు.