చిత్తూరు జిల్లా, పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి కారణం. కాంగ్రెస్ సీఎంగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ఆయన సీఎంగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారు. కిరణ్కుమార్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం." అని అన్నారు.