వెంప స్మశానవాటిక వివాదంలో దళితులకు అన్యాయం చేస్తే సహించం

68చూసినవారు
భీమవరం మండలం వెంప ఎస్సీ స్మశానవాటిక వివాదంలో దళితులకు అన్యాయం జరిగితే సహించేది లేదని పివి రావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మపు సూర్య వరప్రసాద్ అన్నారు. బుధవారం ఆ స్మశానవాటిక ను పరిశీలించారు. దళితులపై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో పొనమండ బాలకృష్ణ, మీసాలజయరాజు, బండిశ్యామ్ బాబు, ఇంజేటి కుమారస్వామి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్