ఆకివీడు మండలం దుంపగడపలోని వీవీ గిరిప్రభుత్వ కళాశాలను గురు, శుక్రవారాల్లో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఏఏసీ) ప్రతినిధులు సందర్శిస్తారని ప్రిన్సిపల్ సుజాత బుధవారం తెలిపారు. ఈ బృందానికి ఛైర్ పర్సన్ సర్దార్ పటేల్ విశ్వవిద్యాయం ఉపకులపతి శిరీష్ కులకర్ణి, కో ఆర్డినేటర్ ఎస్ఎంకే ఖ్యాద్రి వ్యవహరిస్తారని వీరు కళాశాలలో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను పరిశీలించి గ్రేడు కేటాయిస్తారన్నారు.