ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

55చూసినవారు
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
ఏలూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సూచించారు. శనివారం ద్వారకాతిరుమల పంచాయతీ కార్యాలయానికి ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన వర్షాల కారణంగా గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా అన్న విషయంపై అరా తీశారు. విస్తరణ అధికారి సుబ్బరాయన్ తో కలిసి డ్రైనేజీలు, త్రాగునీరు బోర్లు, పారిశుధ్యం నిర్వహణ పరిశీలించారు.

సంబంధిత పోస్ట్