ఏలూరులో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు

51చూసినవారు
ఏలూరు జనసేన పార్టీ ఇన్‌ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తూ గాయపడిన ఎంతోమంది రక్తం అందక మృత్యువాత పడుతున్నారని, అలాంటి మరణాలు పునారావృతం కాకుండా రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసిన మహా వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మెగా అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్