ముఠాలుగా ఏర్పడి నేరాలకు పాల్పడే వారి ఆట కట్టించే అవకాశం. కొత్త న్యాయ, నేర చట్టాలతో దొరికిందని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి బుధవారం తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) చట్టాల అమలుపై జిల్లాలో తీసుకుంటున్న చర్యలను ఎస్పీ వెల్లడించారు. కొత్త చట్టాల్లో ఇష్టారాజ్యంగా చేసే ఫిర్యాదులను అరికట్టే అవకాశం ఉందన్నారు.