అంకితభావంతో కృషిచేసే ప్రభుత్వం ఉంటే ప్రభుత్వ అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తేరనడానికి శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమమే నిదర్శనమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కలెక్టరేట్ లో శనివారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాలతో సైతం సచివాలయ సిబ్బంది శనివారం మధ్యాహ్నం నాటికి 84 శాతానికి పైగా పెన్షన్ల పంపిణీ చేశారన్నారు.