నరసాపురం మున్సిపాలిటీలో దుర్వాసన వెదజల్లుతున్న త్రాగునీరు

79చూసినవారు
నరసాపురం మున్సిపాలిటీలో తాగునీరు దుర్వాసన వెదజల్లుతుందని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ మేకల సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ ద్వారా సరఫరా అయ్యే తాగునీరు కలుషితమవుతోందన్నారు. ఈ నీటిని త్రాగి ప్రజలు డయేరియా, అతిసార వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. కావున వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని సురక్షితమైన త్రాగునీరుని అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్