కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలి: దుర్గేష్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలంతా సహకరించాలని నిడదవోలు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ కోరారు. గురువారం నిడదవోలు రూరల్ మండలం పెండ్యాల, జీడిగుంట గ్రామాల్లో ఎన్నికల ప్రచార జన చైతన్య రథయాత్ర నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.