ఎన్ని కుయుక్తులు పన్నినా వైసీపీ విజయాన్ని ఆపలేరు
పోడూరు: సీఎం జగన్పై రాయితో దాడి చేయడం హేయమైన చర్య అని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడారు. పచ్చమూకలే దాడికి పాల్పడ్డాయని ఆరోపించారు. సీఎం జగన్కు రోడ్ షోలో వచ్చిన ఆదరణ చూసి దాడికి పాల్పడ్డారని, ఎన్ని కుయుక్తులు పన్నినా వైసీపీ విజయాన్ని ఆపలేరన్నారు.