త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 60 శాతం ఓటు బ్యాంకుతో టీడీపీ-జనసేన కూటమి ఘన విజయం సాధించబోతోందని TDP నేత బొండా ఉమా అన్నారు. జగన్ దిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలి? అని డిమాండ్ చేశారు. చంద్రబాబు, అమిత్ షా భేటీతో YCP గజగజ వణికిపోతోందన్నారు. జాతీయ మీడియాలో వచ్చిన సర్వే దెబ్బకు YCP దుకాణం బంద్ అయిందని ఎద్దేవా చేశారు. జగన్ దెబ్బకు అసెంబ్లీ నుంచి మంత్రులు, YCP ఎమ్మెల్యేలు పరార్ అవుతున్నారని అన్నారు.