సీఎం జగన్ సమక్షంలో ఈ నెల 15, 16వ తేదీల్లో ఏదో ఒకరోజు వైసీపీలో చేరనున్నట్లు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 14న వైసీపీలో చేరుతానని, తనతో ప్రయాణించాలనుకునే వారు రావాలంటూ తొలుత తాను పిలుపునిచ్చానని, ఆ పిలుపునకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. భద్రత రీత్యా పర్యాటనను వాయిదా వేశానన్నారు. తానొక్కడినే వెళ్లి పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.