ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని ఎస్పీ కార్యాలయం వద్ద వేదవతి(26) అనే మహిళా AR కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. సెంట్రీ డ్యూటీలో ఉన్న ఆమె తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాయచోటి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వేదవతి కావాలనే గన్ కాల్చుకుందా? లేదా గన్ మిస్ ఫైర్ అయ్యిందా? అనేది విచారణలో తేలాల్సి ఉంది.