AP: కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీసులు వైసీపీ కేడర్ను భయబ్రాంతులకు గురి చేశారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. "ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు. మాజీ మంత్రి సోమిరెడ్డి పట్ట పగలు ఓటర్లకు డబ్బు పంచడంపై ఫిర్యాదు చేస్తే జిల్లా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదు. మానవతా దృక్పథంతో డబ్బు ఇచ్చారనడం హాస్యాస్పదం. ఈ వ్యవహారంపై హైకోర్టుకు వెళ్తా." అని మంత్రి పేర్కొన్నారు.