పీవీ రమేష్ విమర్శలకు వైసీపీ కౌంటర్

55చూసినవారు
పీవీ రమేష్ విమర్శలకు వైసీపీ కౌంటర్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు తానూ బాధితుడినని పీవీ రమేష్ చేసిన విమర్శలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ‘విన్నకోట గ్రామంలో రమేష్ తండ్రి 7 ఎకరాలు కబ్జా చేశారు. అందులో 2 ఎకరాలు ప్రభుత్వ భూమి. అడుగడుగునా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కోర్టు ఆర్డర్‌ను పట్టించుకోలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం చేసేందుకు చంద్రబాబే ఆయనను రంగంలోకి దింపారు.’ అని వైసీపీ ట్విట్ చేసింది.

సంబంధిత పోస్ట్