ఏపీ సీఈవోను కలిసిన వైసీపీ నేతలు

60చూసినవారు
ఏపీ సీఈవోను కలిసిన వైసీపీ నేతలు
ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముఖేశ్ కుమార్‌ మీనాను వైసీపీ ప్రత్తిపాడు అభ్యర్థి బాలసాని కిరణ్, నారాయణమూర్తి క‌లిశారు. ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దాడి, నారా భువనేశ్వరి డబ్బు పంపిణిపై సీఈవోకు ఫిర్యాదు చేశారు. రామాంజనేయులు, ఆయన అనుచరులు త‌న ఇంటిపై దాడికి దిగార‌ని కిర‌ణ్ మీడియాతో చెప్పారు. త‌న‌ను హత్య చేసేందుకు ప్రయత్నించార‌ని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్