వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తమిళనాడులో మూడో లిస్ట్ను విడుదల చేసింది. సౌత్ చెన్నై నుంచి మాజీ గవర్నర్ తమిళిసై పోటీ చేయనున్నారు. ఇక సెంట్రల్ చెన్నై నుంచి వినోజ్ పి.సెల్వం, వెల్లూర్ నుంచి ఫణ్ముగం, కృష్ణగిరి నుంచి నరసింహన్, నీలగిరీస్ నుంచి మురుగన్, కోయంబత్తూరు నుంచి అన్నామలై, పెరంబలూర్ నుంచి పారివేందర్, తూత్తుకుడి నుంచి నైనార్ నాగేంద్రన్, కన్యాకుమారి నుంచి రాధాకృష్ఱన్ పోటీ చేయనున్నారు.