రేపు (శనివారం) వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. ఆచరణకు సాధ్యమయ్యే మరికొన్ని హామీలు, ప్రజాకర్షన పథకాలను సీఎం జగన్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ మేనిఫెస్టో మహిళలు, రైతులు, యువతకు ఎక్కువగా ప్రాధన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.