ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్లోని సదర్ కొత్వాలిలోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అటల్ కూడలి వద్ద మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు పీఆర్డీ జవాన్ను చెంపదెబ్బ కొట్టాడు. దీంతో హైవేపై చాలా సేపు వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పక్కనున్న ట్రాఫిక్ సిబ్బంది ఆపినా ఇద్దరూ ఆగడం లేదు. ఒకరినొకరు కాలర్లు పట్టుకొని వదలడం లేదు. ఈ ఘటనకు సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.