ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర చెర్నోబిల్ అణు ప్రమాదం ఇదే రోజున (1986 ఏప్రిల్ 26) సంభవించింది. అణు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ సరఫరా ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసేందుకు ఇంజినీర్లు ఓ ప్రయోగాన్ని చేపట్టారు. అణు విద్యుత్ కేంద్రంలోని ఓ రియాక్టర్లో కొన్ని వ్యవస్థలకు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. దీంతో రియాక్టర్కు కూలింగ్ వాటర్ను పంపే టర్బైన్లు నెమ్మదించాయి. దాంతో రియాక్టర్లో ఆవిరి కారణంగా పీడనం పెరిగి పేలిపోయింది.