బుర్కినా ఫాసో దేశ ఆర్మీపై మానవ హక్కుల సంఘం తీవ్ర ఆరోపణలు చేసింది. మిలిటెంట్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై 223 మంది పౌరులను ఆర్మీ ఊచకోత కోసిందని హ్యూమన్ రైట్స్ వాచ్ వెల్లడించింది. బాధితుల్లో పిల్లలు, పసికందులు ఉన్నారంది. ఫిబ్రవరిలో ఉత్తర గ్రామాలైన నందిన్, సోరోలో ఈ మారణకాండ జరిగినట్లు చెబుతున్నారు.