వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని
టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
వైసీపీ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఒక కులం, వర్గానికే నన్ను పరిమితం చేసే కుట్ర జరుగుతోందన్నారు. తన వల్ల ఎలాంటి హింస జరగలేదని కచ్చితంగా చెబుతున్నానని పేర్కొన్నారు. మేము ఇచ్చిన లేఖను పరిశీలించాలని సిట్కు లేఖ రాశానని, తమ కాల్ డేటా కూడా పరిశీలించాలని సిట్కు అడుగుతున్నట్లు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.