వరల్డ్ రికార్డు సృష్టించిన భారత అథ్లెట్

60చూసినవారు
వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్-2024లో భారత మహిళా అథ్లెట్ దీప్తి జీవంజి గోల్డ్ మెడల్ సాధించారు. 20 ఏళ్ల దీప్తి మహిళల టీ20 400 మీటర్ల ఈవెంట్ ను 55.07 సెకెన్లలో పూర్తి చేశారు. గత ఏడాది పారిస్ లో జరిగిన ఛాంపియన్షిప్ లో అమెరికాకు చెందిన బ్రెన్నా క్లార్క్ నెలకొల్పిన 55.12 సెకన్ల ప్రపంచ రికార్డును దీప్తి బద్దలు కొట్టారు. పారిస్ 2024 పారాలింపిక్స్ కి కూడా దీప్తి క్వాలిఫై అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్