కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో గత మూడు రోజులుగా విదేశీ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. అక్కడున్న ఏపీ విద్యార్థులతో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం
టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీభరత్, తెలుగు యువత జనరల్ సెక్రటరీ నాగ శ్రవణ్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, ప్రతి విషయాన్ని భారత ఎంబసీకి తెలపాలన్నారు.