వైయస్సార్ చేయూత పథకం ద్వారా రానున్న ఐదేళ్ళలో నాలుగు దఫాల్లో కలిపి మొత్తంగా రూ.1.50 లక్షల దాకా అందిస్తామని వైఎస్ జగన్ అన్నారు. ప్రస్తుతం రూ.75 వేలుగా ఉన్న వైయస్సార్ చేయూతను రూ.1.50 లక్షలకు పెంచుతామని వైసీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు 45 నుంచి 60 ఏళ్ళ వయసు ఉన్న నా అక్కచెల్లెమ్మలకు మరింత ఆదాయం సంపాదించుకునే దిశగా ఈ కార్యక్రమం జరుగుతుందని జగన్ తెలిపారు.