AP: ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే దాడులకు గురైన క్యాడర్ను పరామర్శించి, భరోసా కల్పిస్తానని నాయకులతో జగన్ చెప్పినట్లు సమాచారం. దీంతో జగన్ మరోసారి ఓదార్పు యాత్ర చేస్తారనే ప్రచారం మొదలైంది.