100 కి.మీ. వేగంతో ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్ రైలు (వీడియో)

84చూసినవారు
తమిళనాడులోని కవరైపెట్టై స్టేషన్‌ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆగి ఉన్న గూడ్స్ రైలును భాగమతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 100 కిలో మీటర్ల వేగంతో ఢీకొట్టింది. గ్రీన్ సిగ్నల్ రావడంతో లోకో పైలట్ రైలును ముందుకు తీసుకెళ్లారని, అదే వేగంతో లూప్ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు సమాచారం. రెండు ఏసీ బోగీలు సహా 6 బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీల్లో మంటలు చెలరేగాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్