దేశంలో సాగును మరింత దృఢం చేసేందుకుగాను 100 కొత్త రకాల విత్తనాలను, సాగుపరంగా మరో వంద సాంకేతిక పద్దతులను అందుబాటులోకి తెచ్చేందుకు భారత వ్యవసాయ పరిశోధక సంస్థ (ICAR) సంకల్పించింది. ఇందుకు వందరోజుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కాగా ఈ వర్షాకాలం సాగయ్యే మొత్తం వరి విస్తీర్ణంలో 25 శాతం మేర సాగును వాతావరణ మార్పులను తట్టుకొని నిలిచే విత్తనాలతో కవర్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.