ఐదవ దశ లోక్సభ ఎన్నికలలో భాగంగా సోమవారం ఉత్తరప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటు వేశారు. వీటిలో లలిత్పూర్ నియోజకవర్గంలోని ఒక గ్రామంలో 100 శాతం ఓటింగ్ నమోదు అయింది. లలిత్పూర్ నియోజకవర్గంలోని సోల్డా గ్రామంలో ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు ఓ వ్యక్తి బెంగళూరు నుంచి విమానంలో వచ్చాడని, అతడి కోసం టికెట్ బుక్ చేసినట్లు పోలింగ్ అధికారులు వెల్లడించారు.