భారత్లో 18వ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. తొలిదశలో భాగంగా మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతోపాటు అరుణాచల్ ప్రదేశ్లో 60, సిక్కింలో 92 అసెంబ్లీ స్థానాలకూ ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సాగే ఈ ప్రక్రియను శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు ఈసీ తగు చర్యలు తీసుకుంది.