తొలి దశ పోలింగ్‌ నుంచే బీజేపీ ఓటమి: అఖిలేష్

74చూసినవారు
తొలి దశ పోలింగ్‌ నుంచే బీజేపీ ఓటమి: అఖిలేష్
ఈ నెల 19 నుంచి జరిగే తొలి దశ పోలింగ్‌ నుంచే బీజేపీ ఓటమి ప్రారంభమవుతుందని ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. రాజ్‌పుత్‌లు, క్షత్రియుల ఆగ్రహావేశాలు బీజేపీని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్పారు. ‘ఓటు వేసే అవకాశం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ చెప్పేవన్నీ అవాస్తవం. వారు తప్పుడు వాగ్దానాలు చేశారు. మొదటి దశ ఓటింగ్ నుంచే ఓటమిని బీజేపీ ఎదుర్కొంటుంది’ అన్నారు.

సంబంధిత పోస్ట్