ఈద్-ఉల్-అజా పండుగ సందర్భంగా.. సౌదీ అరేబియాకు పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు తరలివచ్చారు. అయితే.. సౌదీ అరేబియాలో తీవ్రమైన ఎండలు, వేడితో హజ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో 14 మంది జోర్డానియన్లు చనిపోయారు.. మరో 17 మంది తప్పిపోయారు. ఈ విషయాన్ని జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.