కూటమి పాలనకు వంద రోజులు.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

68చూసినవారు
కూటమి పాలనకు వంద రోజులు.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
ఈ నెల 20కు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు.. ప్రజల వద్దకే వెళ్లి తమ పాలనపై అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు కూటమి ఎమ్మెల్యేలతో బుధవారం సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరగనున్న ఈ సమావేశానికి అందరూ రావాలని ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్