ేశవ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఒక్క మే నెలలోనే 19.50 లక్షల ఉద్యోగ కల్పన జరిగిందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) తెలిపింది. వారంతా ఈపీఎఫ్ఓ చందాదారులుగా చేరారని వెల్లడించింది. మే 2023తో పోలిస్తే, మే 2024లో 19.62 శాతం మంది ఎక్కువగా ఈపీఎఫ్ఓ చందాదారులుగా మారారని వెల్లడించింది. ఉద్యోగావకాశాలు, ఉద్యోగుల అవకాశాలపై అవగాహన పెరగడం, ఇతర కార్యక్రమాల వల్ల సభ్యుల చేరిక పెరిగిందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.