లెజెండరీ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా మరణం చాలా బాధ కలిగించింది: అమిత్ షా

74చూసినవారు
లెజెండరీ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా మరణం చాలా బాధ కలిగించింది: అమిత్ షా
రతన్‌ టాటా మృతి పట్లకేంద్ర హోం మంత్రి స్పందించారు. “లెజెండరీ పారిశ్రామికవేత్త.. నిజమైన జాతీయవాది.. ఆయన మరణం చాలా బాధ కలిగించింది. నిస్వార్థంగా మన దేశాభివృద్ధికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. నేను ఆయనని కలిసిన ప్రతిసారీ భారతదేశం.. దేశ ప్రజల అభ్యున్నతి పట్ల ఆయన చూపే ఉత్సాహం, నిబద్ధత నన్ను ఆశ్చర్యపరిచేవి. ఆయన మన హృదయాలలో జీవించి ఉంటారు. టాటా గ్రూప్ మరియు ఆయన అసంఖ్యాక అభిమానులకు నా సానుభూతి." అని అమిత్ షా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్