తెలుగు రాష్ట్రాలకు మరో 2 వందే భారత్ రైళ్లు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

55చూసినవారు
తెలుగు రాష్ట్రాలకు మరో 2 వందే భారత్ రైళ్లు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కానుక అందించారు. ఈ నెల 16న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ - హైదరాబాద్, దుర్గ్ - విశాఖపట్టణం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ రైళ్ల అనుసంధానత కలిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్