తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 61,409 మంది భక్తులు దర్శించుకోగా, 33,384 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీకి 3.04 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.