ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి బంగారు గనిలో తవ్వకాలు జరిపేందుకు దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) అనే కంపెనీకి అనుబంధ సంస్థ అయిన జెమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. బంగారం గనిలో ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ఉత్పత్తి మొదలు కానుంది. ఈ గనిపై రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు దక్కన్ గోల్డ్ మైన్స్ గతంలో వెల్లడించింది.