జమ్మూకశ్మీర్ లో ఇద్దరు ముష్కరులు హతం

84చూసినవారు
జమ్మూకశ్మీర్ లో ఇద్దరు ముష్కరులు హతం
పాకిస్థాన్ నుంచి సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి భారత్ లోకి చొరబడాలని ప్రయత్నించిన ఉగ్రవాదుల కుట్రను సైన్యం అడ్డుకుంది. కుప్వారా జిల్లాలోని తాంగ్ ధర్ సెక్టార్ వద్ద చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ముష్కరులను సైన్యం మట్టుపెట్టింది. మరోవైపు ఆ ప్రాంతంలో జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. చుట్టపక్కల ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్