శ్రీవారి దర్శనానికి 25 గంటల సమయం

57చూసినవారు
శ్రీవారి దర్శనానికి 25 గంటల సమయం
తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్ని నిండి బయట వరకు క్యూ లైనులో భక్తులు వేచివున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి 25 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 83,866 మంది భక్తులు దర్శించుకోగా.. 35,403 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్