స్కూల్ బస్సులో మంటలు.. 25 మంది విద్యార్థుల మృతి (వీడియో)

67చూసినవారు
స్కూల్ బస్సులో మంటలు చెలరేగడంతో 25 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘోర ప్రమాదం థాయ్‌ల్యాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో చోటుచేసుకొంది. పాఠశాల విద్యార్థులు, వారి టీచర్‌ను తీసుకెళుతున్న ఓ బస్సు మంటల్లో చిక్కుకొంది. సెంట్రల్‌ ఉతాయ్‌ థాని ప్రావిన్స్‌ నుంచి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 44 మంది ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు ట్రిప్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్