లోక్సభ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. 2024 ఎన్నికల్లో తొలిసారి 280 మంది కొత్తవారు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2019లో ఆ సంఖ్య 267గా ఉంది. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. తాజా ఎన్నికల్లో ఎన్నికైన వారిలో 263 మంది గతంలోనూ ఎంపీలుగా చేశారు. పీఆర్ఎస్ లెజిస్టేటివ్ రీసర్చ్ సంస్థ ఈ డేటాను ఇచ్చింది. కాగా, 18వ లోక్సభలో బీజేపీ 240 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ(99) ఉంది.