టీ20 ప్రపంచకప్లో సూపర్-8 చేరిన భారత జట్టు విండీస్ వేదికగా 20వ తేదీన అఫ్గానిస్థాన్తో తలపడనుంది. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ '5 రోజుల స్వల్ప వ్యవధిలో 3 కీలక మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కఠినమైన ప్రత్యర్థులను ఢీకొట్టనున్నాం. ప్రాక్టీస్ సెషన్లను సీరియస్గా తీసుకుని విజయం కోసం 100 శాతం కష్టపడతున్నాం. మా బలాలపై దృష్టిపెట్టి.. ప్రత్యర్థిని ఓడించేందుకు ప్రయత్నిస్తాం' అని తెలిపాడు.